Thursday 11 August 2011

వాడు నిర్మించిండా?

ఒక సీమాంధ్ర మూర్ఖ నాయకుడు 1956లో రాళ్ళు, రప్పలుగా ఉన్న హైదరాబాదును తామొచ్చి అభివృద్ధి చేసినమని చెప్తున్నడు. సిగ్గూ షరం లేని ఆ వెధవ వచ్చి, అసెంబ్లీని నిర్మించిండా? వాడు వచ్చి హైకోర్టును కట్టిండా? వాడు ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా తాగుతున్న మంచి నీళ్ళను అందిస్తున్న గండిపేట్ జలాశయాన్ని వాడు నిర్మించిండా? ఉస్మానియా, గాంధి హాస్పిటల్స్ వాడు కట్టించిండా? ఆకాశవాణి వాడు పెట్టించిండా? ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కాలేజ్ వాడు వచ్చి కట్టిండా? నాంపల్లి, కాచిగుడా, సికింద్రాబాదు రైల్వే స్టేషన్లు వాడు కట్టించిండా? రాజ్ భవన్, రాష్ట్రపతి నిలయం వాడు నిర్మించిండా? పబ్లిక్ గార్దెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాడె గట్టిండా? మింట్ కాంపౌండ్, సాలార్ జంగ్ మ్యూజియమ్, చార్మినార్ ఇవన్నీ వాడె నిర్మించిండా? ఆర్.టి.సి. (అప్పుడు ఆర్.టి.డి.) బస్సులు వాడు స్టార్ట్ చేసిండా? ఎలక్ట్రిసిటి బోర్డ్ వాడె పెట్టిండా? బేగంపెట్ ఏర్ పోర్ట్ వాడె కట్టించిండా? ఇవేవీ 1956లో లేవ? ఆ గుడ్డోడికి ఇవన్ని రాళ్ళూ రప్పలుగ కనిపించినయా? అప్పటికే హైదరాబాద్ ఇండియాలో ఐదవ పెద్ద నగరం ఎట్లయింది మరి .. ఆ పిచ్చోడె చెప్పాలె. హైదరాబాద్ లో చివరి నిజాం కట్టినవన్ని సిగ్గు లేకుండా అనుభవించి ఇట్ల మాట్లాడ్డానికి వాడికి సిగ్గు షరమున్నదా?  పోనీ, నిజాం కట్టిన వాటిలో సగమన్నా వాడి ప్రాంతంలో ఒక్క నగరంలోనైన ఈ అరవయ్యేళ్ళలో కట్టించిండా? తెలంగాణలో ఒక సామెత ఉన్నది - " తన ముడ్డి కడుక్కోలేనోడు వాగును శుభ్రం జేసిన అన్నడట! ". రాళ్ళు రప్పలని మాట్లాడిన ఆ మూర్ఖుడి ప్రాంతాన్ని వాళ్ళోళ్ళే రాళ్ళ సీమ అని చెప్పుకొంటరు. ఆ ప్రాంతంలో ఒక రాజధాని వచ్చి అభివృద్ధి చెందడం వాడికి ఇష్టం లేదు. వాడి బొంద మాత్రం అజీర్తి అయినా ఇంకా నింపుకొంటూనే ఉంటడు. వాడు హైదరాబాదును ఆస్తిగా చూచే నీచుడు.
మేము హైదరాబాదును కన్నతల్లిలా ప్రేమిస్తాం.
1940లలోనే మా కన్న తల్లి వైభవాన్ని చూడరా దరిద్రుడా!
















Tuesday 9 August 2011

గురువింద గింజలు

"తెలంగాణ అనకపోతే దాడులు చేస్తారా?" అంటూ పెద్ద ప్రజాస్వామ్య వాదుల్లా మాట్లాడుతరు సీమాంధ్రలోని కుహనా సమైక్యవాదులు. మరి వాళ్ళు వరుసగ చేస్తున్న పనేందో? గురువింద గింజలు వాటి .... కింద నలుపెరుగయి మరి!


Monday 8 August 2011

ఇన్నాళ్ళకు దారిలోకి వచ్చినాడు ఈ పెద్ద మనిషి

ఇన్నాళ్ళకు బుద్ధి వచ్చి దారిలోకి వచ్చిండు  ఈ పెద్ద మనిషి. మరి మిగతా సీమాంధ్ర నాయకులకు కూడా బుద్ధి వస్తదో? లేక వాళ్ళ బుద్ధి గడ్డి తింటూనే ఉంటదో? చూడాలె!




Saturday 6 August 2011

విశ్వాస ఘాతుకం

పార్లమెంటులో తెలంగాణ ప్రజల ఆవేదనను,ఆకాంక్షను చక్కగా వినిపించినారు జాతీయ ప్రతిపక్ష నేత శ్రీమతి సుష్మా స్వరాజ్. ఇతర భాషకు చెందిన ఆమె అర్థం  చేసుకొన్నంత సాటి తెలుగు వాళ్ళు కొందరు (ముఖ్యంగా సీమాంధ్ర ధనిక, మధ్య తరగతి వర్గం వాళ్ళు) అర్థం చేసుకొనక పోవడం విచిత్రం. ఆమెది స్వంత ప్రయోజనాలు లేని నిష్పాక్షిక దృష్టి మరి. సీమాంధ్ర నాయకులది సంకుచిత స్వార్థ ప్రయోజనాల దృష్టి ఆయె. "ఒక్క సీటు లేని పార్టీ కూడ మాట్లాడుతున్నది" అని వెక్కిరించినాడు కావూరి. ఒక్క సీటు లేక పోయిన అక్కడి పరిస్థితులను వివరించడం జాతీయ  ప్రతిపక్ష నేతగా నా బాధ్యత అని ఆమె గడ్డి పెట్టినారు.


Monday 25 July 2011

మరి ఇదేందో - ?

తెలంగాణలో కొందరు సమైక్యవాదులున్నరు. తెలంగాణవాదులు వాళ్ళ గొంతు నొక్కుతున్నరు. తెలంగాణకు వ్యతిరేకంగ మాట్లాడితె వాళ్ళు అడ్డుకొంటరని భయపడి ఆ సమక్యవాదులు మాట్లాడలేకపోతున్నరని సమైక్యవాదులు గగ్గోలు పెడూతున్నరు. మరి ఇదేందో - ?


Sunday 24 July 2011

సీమాంధ్ర కవులేమంటున్నరు?

ఇద్దరు పేరుమోసిన సీమాంధ్రకవులు నిష్పాక్షికంగా చెప్పిన తమ మనసులోని మాటలు చూడండి.