Tuesday 27 August 2013

సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే! - 2

సీమాంధ్రులు సాగిస్తున్న కుహనా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడ చూచినా పొట్టి శ్రీరాములు గారి ఫ్లెక్సీలే!
ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు!!
ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమని వీర ప్రసంగాలు.. విభజన వాదం వినాశకరమని, ఐకమత్యమే బలమని ఊకదంపుడు ఆదర్శాల ప్రకటనలు...
వీళ్ళ పచ్చి అబద్ధాలకు అంతుందా?
అసలు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ ఉపవాస దీక్షకు కూర్చున్నది మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని (అప్పటికి ఇంకా తెలంగాణ ప్రస్తావనే లేదు) ఏర్పర్చాలని...  19.10. 1952 నాడు.
ఆయన పక్కా విభజన వాది!
ఆయన ఆత్మార్పణ జరిగింది (నిజానికి సీమాంధ్రులు ఆనాడు మద్రాసు తమకు దక్కదని తెలిసీ దురాశతో ఆయన చావును కళ్ళ చూశారు) 15.12.1952 నాడు.
 ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడింది 01.10.1953 నాడు.
అప్పటికే తెలంగాణ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంది.
ఆ పైన దేశంలో 4వ పెద్ద నగరమైన మద్రాస్ నగరాన్ని సాధించుకోలేకపోయిన సీమాంధ్రులు 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ నగరంపై కన్నేసి 3 సంవత్సరాలు లాబీయింగ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా ... "పెద్దమనుషుల ఒప్పందం" అంటూ మాయ మాటలు చెప్పి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొన్నారు.
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారు గతించిన 4 సంవత్సరాల తరువాత  01.11.1956 నాడు.
ఇదీ చరిత్ర !!!
ఇన్నీ తెలిసీ ... పాఠ్య పుస్తకాల్లో సైతం - "పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది" అని బోధిస్తున్నారంటే ... సీమాంధ్ర పాలకులు, మేధావులు ఎంత అబద్ధాలకోరులో .., కుట్రదారులో చూడండి.
ఉపవాస దీక్షకు కూర్చునే ముందు పొట్టి శ్రీరాములు గారు పత్రికలకు అందించిన బహిరంగ లేఖలోని ఈ ముఖ్య భాగాన్ని చూస్తే చిన్న పిల్లాడికైనా ఈ విషయం అర్థమౌతుంది.
















































































ఇంకా విశదంగా తెలుసుకోవాలంటే ఈ లింకులపై క్లిక్ చేసి చదవండి.

http://aksharsatya.blogspot.in/2013/08/blog-post_8639.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3317.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_4444.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_27.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3888.html

("అక్షర సత్యాలు", "కోటి రత్నాల వీణ" బ్లాగర్లకు ధన్యవాదాలతో )

Sunday 25 August 2013

సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే!!

ఊసరవెల్లి "ఉండవల్లి" ఒక మీటింగ్ పెట్టి "తెలంగాణ వాళ్ళు రా.. రా.. అని పిలిస్తే మేము వచ్చి కలిసాం" అనగానే సీమాంధ్రులంతా (ముఖ్యంగా కుహనా సమైక్య బ్లాగర్లు) రెచ్చిపోయారు.
"సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే!" అని నిరూపించారు "అక్షర సత్యాలు" బ్లాగరు శ్రీ మల్లికార్జున స్వామి గారు. ఆయనకు హృదయ పూర్వక అభినందనలు!
ఈ పేపర్ కటింగ్ (1955) లను చూడండి.







Monday 19 August 2013

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు?

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు? అసలు వీళ్ళు భారతీయులేనా?
నిజానికి వీళ్ళే అసలైన "తెలబాన్లు"! తిన్నింటి వాసాలు కూల్చే "స‘మెక్కు‘ సాలెగాళ్ళు"!


నిజమైన తెలుగు బిడ్డ నిజాయితీ మాట ...


ఆంధ్రా ప్రాంతలో పుట్టి పెరగడం, తెలంగాణంలో నివసించడం వలన ఇరు ప్రాంతాలలో జరిగే ఉద్యమాలను దగ్గరగా చూసే అవకాశం, అనుభవం ఉంది. ఈ మొత్తం ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది, తిరుగుతూనే ఉంది. ఇరు ప్రాంతాలలోనూ నాపై కొంత వ్యతిరేక భావన ఉండడం గమనార్హం. ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత ఎందుకంటే నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కావడం. తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేక భావన కలుగడానికి కారణం నేను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడను కావడం. ఆంధ్రా వాడు ఎప్పటికైనా ఆంధ్రావాడే అవుతాడు కాబట్టి అనేది సాధారణ అవగాహన అయి ఉండవచ్చు. ఏది ఏమైనా అవి నా మీద కలగిన భావనలే అయినప్పటికీ, నాలో కలిగిన భావనలు కాదు కాబట్టి నేను పెద్దగా బాధ పడవలసిన అవసరం లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయిన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో కొన్ని అనుభవాలు భలే గమ్మత్తుగా అనిపించాయి. అవేవనగా
(1)   బహుశా నాలుగేళ్ళ క్రితం అనుకుంటా? Hair saloon కి వెళ్లాను. అక్కడ Barber కి నాకు జరిగిన సంభాషణ ఇలా వుంది.
బా: ఈ తెలంగాణా గొడవ జరుగుతుంది కదండీ? మీ కెలా వుంటుందండీ? Problem ఏమీ లేదా?
నేను: అబ్బే మాకలాంటి సమస్యలేమీ రాలేదు? అయినా నేను తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకిని కాను.
బా: అదెలాగా? మీరు ఈ ప్రాంతానికి చెందిన వారై, వాళ్లకు ఎలా support చేస్తారు.
నే: నేను support చేసేది ప్రాంతాన్ని బట్టికాదు. వాళ్ళ demand లో సామాజిక న్యాయం ఉంది. అందుకే నా నైతిక మద్దత్తు ఆ ఉద్యమానికి ఉంది.
బా: (గట్టిగా నవ్వి) మీరు భలే తెలివైన వారండీ? ఏ ఎండకా గొడుగు పడతారన్న మాట. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మాట్లాడుతున్నారా?
నే: నాకు అంత భయం లేదు సార్. నా మద్దత్తు ఇవ్వడానికి సరిపడా అన్ని కారణాలు అక్కడ ఉన్నాయి. అంతే.
బా: మీకు తెలంగాణా వాళ్ల గురించి మీకు తెలియదు సార్. అక్కడ తెలంగాణా ఇచ్చేస్తే మనం ఆకలితో చచ్చిపోతాం.
నే: అవునా ఏమిటది (నేను అప్పటికి 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాను)
బా: అవునండీ! వాళ్ళుమనకి నీళ్ళు రానివ్వరు. ఈ సస్యశ్యామలమైన ఈ నేలలో మీరు కరువు చూడవలసి వస్తుంది. మనం తిండి లేక చనిపోవాల్సి వస్తుంది.
(నేను గట్టిగా నవ్వేను)
బా: మీరు నవ్వకండి. మీకంత వయసులేదు. మీకు ఇప్పుడు అర్ధం కాదు.
నేను: రాష్ట్రం రెండుగా విడిపోవడం వలన మీరు నడిపే ఈ బిజినెస్ కి ఏమైనా నష్టం వస్తుందా?
బా: రాదు, కానీ, హైదరాబాదుని మనమే develop చేసాము.
నే: ఏమోనండి నాకు తెలియదు. మా కుటుంబం నుండి హైదరాబాదు వెళ్ళినోడిని నేనొక్కడినే. నేను వెళ్ళింది చదువుకోవడానికి మాత్రమే. హైదరాబాదు అభివృద్ది చేయడంలో నాకు గానీ, మా కుటుంబానికి గానీ ఏ విధమైన పాత్ర లేదు.
బా: (కళ్లల్లో కోపం) మీకంత వెటకారం అవసరం లేదు. మీకసలు సమస్యే అర్ధం కావడం లేదు (మాటల్లో చెప్పలేని చిరాకు). [అప్పటికే అతని కత్తి నా గడ్డం గీస్తూ ఉంది. ఈ మాటల సందర్భంలో అది నా గొంతు దగ్గర ఉంది. రాష్ట్రం కన్నా ప్రాణం ముఖ్యం అనిపించింది. నేను ఇక అతనితో మాట్లాడలేదు. నాతో నేను మాట్లాడుకోవడం మొదలెట్టాను “ఇంత భయాన్ని పోగొట్టెదెలా?”.
(2)   ఈ వారంలో నేను మా అమ్మకు ఫోన్ చేసాను. ఎక్కడున్నావు అంటే ’చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము’ అంది. ఎందుకో అని కాకతాళీయంగా అడిగిన నాకు ’సమైక్యాంధ్ర కోసం, శాంతి కోసం’ అన్న సమాధానం నాలో అశాంతిని రేకెత్తించింది. నేను మళ్ళీ అడిగాను “అమ్మా! సమైక్యాంధ్రా కోసమా? శాంతి కోసమా?’. బహుశా ఇది చాలా పిచ్చి ప్రశ్నలా మా అమ్మకి అనిపించి ఉండవచ్చు. “అదేమిటి బాబు, సమైక్యాంధ్ర వస్తే శాంతి వచ్చినట్టే కదా’ అంది. అప్పుడు నేను తమాయించుకొని ఇలా చెప్పాను, “సమైక్యంగా ఉండడం వలననే గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది. ఆ అశాంతిని తొలగించి, శాంతిని నెలకొల్పడానికే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చింది. నువ్వు/ మీరు ఉపవాస ప్రార్థనలతో సమైక్యాంధ్రాను తెచ్చేస్తే పోయిన అశాంతిని తిరిగి తెచ్చినట్టే కదా అమ్మా” అన్నాను. మా అమ్మకేదో అర్ధమయ్యినట్టుంది. ’అలాగా! మరి హైదరాబాదు నుండి మన వాళ్లను పంపించేస్తారట?’ అని అడిగింది. బహుశ ఇది వారి ప్రార్థనలో రెండో అజెండా అయి ఉండవచ్చు. ఇక నుండీ మా సంభాషణ కొంత ఆశక్తికరంగా జరిగింది.
నేను: చాలా మంచి ప్రశ్న అమ్మా. అదే నిజమైతే నేను ఇప్పటికే వచ్చేసి ఉండాలి కదా?
అమ్మ: అవును, కానీ నువ్వు రాలేదు
నేను: పోనీ శరీన్ (సోదరుడు) వచ్చేసాడా?
అమ్మ: లేదు
నేను: మమ్మల్ని వదిలేయ్. పార్వతి కుటుంబం (carpenters in hyd) ఎవరైనా వచ్చారా?
అమ్మ: లేదు
నేను: ఇవన్నీ కాకపోయినా, నీకు తెలిసున్న వాళ్ళు ఏ ఒక్కరైనా వచ్చేసారా?
అమ్మ: లేదు
నేను: అలాంటప్పుడు ఇక్కడనుండి అందరినీ పంపించేస్తారన్న మాట వాస్తవమేనా?
అమ్మ: కాదు, మరి అందరూ అలా ఎందుకు చెబుతున్నట్టు
నేను: రాజకీయం మమ్మీ. భయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మొత్తం విశయాన్ని అర్ధం చేసుకోవడానికి నీకు మనకు బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. మనం మరియు మరికొన్ని కుటుంబాలు ఉద్యోగ రీత్యా జీవితంలో సింహ భాగం మన జిల్లా ఆదివాసీల ప్రాంతంలో గడిపాము. మీరు ఆ ఊరికి వెళ్ళే సరికి కరెంటు కూడా లేదు. అలాంటి ఊరిలో పీటర్ (తాతయ్య) గారు ప్రతీ కార్యక్రమంలో ముందుండి ఆ ఊరి అభివృద్దికి తన వంతు సాయాన్ని అందించారు. దానికి అక్కడున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు సహకరించారు. పీటర్ గారు ఒక స్థాయి గౌరవాన్ని అనుభవించారు. ఇలాంటి సమయంలో ఆయన ఈ ఊరిని నేనే అభివృద్ది చేసాను. ఈ ఊరు నాది అని అంటే ఎవరైనా ఊరుకుంటారా?
అమ్మ: ఎందుకు ఊరుకుంటారు
నేను: కదా! ఆ ఊరులో ఇల్లు కొనుకున్నారు, పొలం కౌలుకి తీసుకున్నారు. ఉద్యోగ విరమణ సమయం వరకూ అక్కడే ఉన్నారు. విరమణ తరువాత తమ సొంత ప్రాంతానికి వచ్చేసారు. అలాకాకుండా అక్కడే ఉండిపోయినా సమస్య ఏమీ ఉండదు. కానీ ఇది నాది, నేను మాత్రమే అభివృద్ది చేసాను అంటేనే సమస్య మొదలవుతుంది. హైదరాబాదు సమస్య అలాంటిదే? పెద్ద కొట్టు బాబూరావు, చిన్ని కృష్ణ, జ్యోతుల వెంకట్రావు, సైకిల్ షాపు రాంబాబు లాగా సమాజానికి అవసరమైన వస్తువులను అందించే వ్యాపారం చేసినంత వరకూ ఎవ్వరూ ఏమీ అనరు. మా వల్లే ఈ ఊరు అభివృద్ది చెందింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ’అశాంతి’ వస్తుంది. లాజిక్ అర్ధమయ్యింద అమ్మా?
అమ్మ: అర్ధమయ్యింది బాబూ. వీళ్లందరూ చెబుతుంటే అదే నిజమనుకున్నాను.
నేను: హ హ హ. ఇప్పుడర్ధమయ్యిందిగా. ఈ శుభవర్తమానమును సర్వలోకమునకు తెలియజేయండి. వెళ్లండి.
(అమ్మ నవ్వింది. నా పని ఇప్పుడే మొదలయ్యింది)

Posted by Suresh Kumar Digumarthi (A research scholar in political science at Hyderabad) in his blog "Singing in the Train"

Saturday 10 August 2013

హైదరాబాద్ తెలంగాణదే!!!


’ఏబిఎన్-ఆంధ్రజ్యోతి’ ఛానల్ ( సీమాంధ్ర ఛానలే ) వారు ’జెస్ట్ వింగ్స్’ సంస్థ వారి అధునాతన సాంకేతిక సహకారంతో హైదరాబాద్ గురించి హైదరాబాద్ ప్రజల ( అన్ని వర్గాలకు చెందిన 5.67 లక్షల మంది ) నుండి జరిపిన ’అభిప్రాయ సేకరణ’లో -
"తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండాలి" అన్నవారు = 46.57% మంది.
"హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలి" అన్నవారు ( "పదేళ్ళు ఉమ్మడి రాజధాని" అంటే... ఆ తరువాత అది పూర్తిగా తెలంగాణకు చెందాలని అంగీకరించినట్టే ) = 20.37% మంది.
వెరసి "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని అంగీకరించినవారు మొత్తం = 66.94% మంది.

అంటే "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని హైదరాబాద్ లో మూడింట రెండు వంతుల భారీ మెజారిటీ ప్రజలు కోరుకొంటున్నారు.
ఇంక వివాదం ఎక్కడుంది?
ఈ రెఫరెండంను సీమాంధ్రులు గమనించాలి! గౌరవించాలి!!!



Friday 9 August 2013

దోపిడీదార్లమని ఒప్పుకొన్నట్టె కద! సిగ్గు! సిగ్గు!!

పదమూడేళ్ళుగ తెలంగాణ వాళ్ళు సమైక్య రాష్ట్రంలో మా నీళ్ళు, నిధులు, నియామకాలు దోపిడీకి గురవుతున్నయంటే ససేమి కాదని వితండ వాదం చేస్తున్న సీమాంధ్రులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే నీళ్ళ జగడాలు మొదలవుతయి అంటున్నరు.

 అంటే ఇన్నాళ్ళు నీళ్ళ విషయంలో ఏదొ కిరికిరి ఉన్నట్టె కద!

హైదరాబాదు లేకపోతే మాకు నిధులు సరిపోవు అంటున్నరు. అంటే ఇన్నాళ్ళు నిధుల విషయంలో ఏదొ గడబడ్ చేసినట్టె కద!

మా ఉద్యోగాలకు భద్రత లేదు అంటున్నరు. మా పిల్లలకు ముందు ముందు ఉద్యోగాలు రావు అంటున్నరు. వీధుల్లో పడి విధ్వంసం సృష్టిస్తున్నరు. అంటే ఇన్నాళ్ళు నియామకాల విషయంలో మోసం చేసినట్టె కద!

ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ఉన్నది. రేపు కొత్తగ ఏర్పడె రెండు రాష్ట్రాలు భారత దేశంలోనే ఉంటయి. అప్పుడైన, ఇప్పుడైన భారత రాజ్యాంగానికి లోబడె పని చేస్తయి. మరి్ ఇప్పుడు కొత్తగ రెండు రాష్ట్రాలు ఏర్పడితె, రాజ్యాంగ బద్ధంగ వచ్చేటివి ఎందుకు రావు? అంటే ఇన్నాళ్ళు రాజ్యాంగానికి అతీతంగ అక్రమంగ అవన్ని సీమాంధ్రులు దొబ్బుతున్నట్టె కద! 

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు వేరొక ప్రాంతం వాళ్ళని EXPLOIT చెయ్యక పోతె .... ఒక ప్రాంతం వాళ్ళు మేం వేరుపడుతం అంటె వేరొక ప్రాంతం వాళ్ళు అంతే పౌరుషంగ "పోతె పొండి. మేం గూడ వేరు పడుతం" అనాలె. ఎందుకంట లేరు?
అసలు తెలంగాణతో విడిపోతె మా బతుకులు కుక్క బతుకులవుతయి అంటున్నరంటే ఇన్నాళ్ళు తెలంగాణను జలగల్లాగ పట్టి పీక్క తిన్నట్టె కద!

ఇంత సిగ్గు, లజ్జ లేకుండ నడి వీధులలో నగ్నంగ నిల్చుని, మేం అరవై ఏళ్ళనుండి దోపిడి చేసినమని చాటుకోడం ఏంది? ఇదంత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి సపోర్ట్ చేసుడేంది? సిగ్గు చేటు!

ఏమన్నంటే ... హైదరాబాదుని మేం డెవలప్ జేసినం అంటరు. ఏం? మా తెలంగాణవాళ్ళు టాక్సులు కట్టలేద? ఎప్పుడైన కలిసి ఉన్నప్పుడు అందరు కలిసె కట్టుకొంటరు. విడిపోయినాక ఎవరిది వాళ్ళు కట్టుకొంటరు. ఇది ఒకడు చెప్పాన్నా? సీమాంధ్రుల దిమాఖ్ కెక్కద? 
అయినా ఏం డెవలప్ జేసినరు? లగడపాటి లాంకో హిల్స్ లొ తెలంగాణ పేదోడికేమన్న ఇచ్చినడా? కావూరి కట్టిన రోడ్లలో తెలంగాణ వాళ్ళకి  ఏమన్న టోల్ టాక్స్ ఫ్రీయా? మీ వ్యాపారాలు, మీ డబ్బులు మీరు చూసుకొన్నరు.

మీ సిగ్గు లేని వాదనలు విన్న దేశంలోని అన్ని పార్టీల ముందు మీరు నవ్వులపాలయితెనె గదా.... తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఇంకెంత కాలం ఇజ్జత్ తీసుకొంటరు?


Thursday 1 August 2013

అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.


ఇంకా కొందరు సీమాంధ్రులు కేవలం  బెదిరింపులు, సెంటిమెంట్లకు లొంగి తెలంగాణ ఇచ్చేసారనడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణకు ఏ అన్యాయం జరగకుండానే ఇంతమంది జాతీయ పార్టీల నాయకులు తెలంగాణకు మద్దతిచ్చారా? ఏ అన్యాయం జరగకుండానే, లోపల ఇష్టం లేకున్నా మన రాష్ట్ర పార్టీలన్ని బయటికి మద్దతిస్తున్నామని ప్రకటించవలసి వచ్చిందా? వీళ్ళందరి కన్నా సీమాంధ్ర వితండ వాదులు తెలివైనవారా? వీరి వాదన బలమైనదా?
మొన్నటికి మొన్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయవలసిన ముఖ్యమంత్రి ఒక్క చిత్తూరు జిల్లా ఉత్సవాలకు 700 కోట్లిచ్చి, 10 తెలంగాణ జిల్లాల కాకతీయ ఉత్సవాలకు 120 కోట్లిచ్చాడు. అదేమిటని హరీష్ రావు అసెంబ్లీలో నిలదీస్తే - "తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను..  రాసి పెట్టుకో ... " అని అహంకారంతో విర్రవీగలేదా? పాత కాలంలో నడిచి పోయింది గాని, కమ్యునికేషన్లు ఇంతగా అభివృద్ధి చెందాక  ఇదంతా దేశ  నాయకులు, ప్రజలు చూడడం లేదనుకొంటున్నారా ?
బెదిరింపులు, సెంటిమెంట్ల కథలు చెప్పి తెలంగాణను ఆపాలని చూస్తున్నది సీమాంధ్రులు!
కలసి ఉండాలంటే ఇద్దరి అంగీకారం ఉండాలన్నది సాధారణ ప్రజాస్వామిక సూత్రం. నా కిష్టం లేకపోయినా, నువ్వు చచ్చినట్టు నాతో కలసి ఉండాల్సిందే అనడం ఏం న్యాయం?
వీరి మూర్ఖత్వానికి, దౌర్జన్యానికి అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.