Thursday 19 December 2013

పిరికిపందలు!!!


వాళ్ళు చేసే సమైక్యాంధ్ర ఉద్యమం పక్షాన ధర్మం లేదు. వాళ్ళు తెలంగాణను అడ్డుకోవడంలో నీతి, న్యాయం లేదు. వాళ్ళు చెప్పే సమైక్య వాదంలో బలం లేదు. ఉంటే.. గింటే.. అసెంబ్లీలో ఇప్పుడు.. అరవయ్యేళ్ళుగా సాగుతున్న తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తప్పని.. బలంగా వాదించి తూర్పారబట్టవచ్చు గదా!  పద్నాలుగేళ్ళుగా బలపడ్డ వేర్పాటు వాదాన్ని చర్చించి ఎండగట్టవచ్చు గదా! విభజన వల్ల తామేం నష్టపోతామో వివరించి ప్రపంచానికి చాటవచ్చు గదా! కాని వాళ్ళకేం కావాలో వాళ్ళు చర్చించి బయటికి బాహాటంగా చెప్పలేరు. ఎందుకంటే చర్చిస్తే.. వాళ్ళు కోరేదాంట్లో నీతి, నిజాయితీ లేదని తేలిపోతుందని వాళ్ళకూ తెలుసు. వాళ్ళ వాదంలో నిజాయితీ, బలం ఉండి ఉంటే... శాసనసభలో ఈ సువర్ణావకాశాన్ని ఎందుకు వదులుకొంటారు? వాళ్ళ వాదనలో బలం ఉంటే పద్నాలుగేళ్ళుగా తెలంగాణవాదం ఎందుకు బలపడేది? వాళ్ళ వాదనలో బలం ఉంటే ఎందుకు వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేశారు? వాళ్ళ వాదనలో బలం ఉంటే తెలంగాణ పది జిల్లాలలో వాళ్ళ ఉద్యమానికి కనీస మద్దతు ఎందుకు కరువయ్యింది? వాళ్ళ వాదనలో బలం ఉంటే యావత్తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిల్చొని ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది? వాళ్ళ వాదనలో బలం ఉంటే దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనకు ఎందుకు అంగీకరించాయి?  అందుకే చర్చించే దమ్ము, ధైర్యం వాళ్ళకు లేదు. చర్చిస్తే.. అరవయ్యేళ్ళుగా తాము చేస్తున్న దోపిడి బండారం బట్టబయలవుతుందన్న భయం. చర్చిస్తే.. ఆ దోపిడి కొనసాగడానికే తాము తెలంగాణను అడ్డుకొంటున్నామని ఒప్పుకోవలసి వస్తుంది. ఎదుటివాణ్ణి ముంచి తాము బాగుపడాలన్న స్వార్థంతో నిండిందే తమ సమైక్యవాదమని అంగీకరించవలసి వస్తుంది.
పిరికిపందలు... అందుకే చర్చను జరుగకుండా అడ్డుకొంటున్నారు. నానా గొడవ చేసి శాసనసభను రెండు వారాలపాటు వాయిదా వేయించారు.   

Sunday 17 November 2013

ఒకే ఒక్కడు చాలు!



ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న ఫోటో ఇది.
ఇది 100% correct !!!

Monday 4 November 2013

ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్.......


సీమాంధ్రుల కొన ఊపిరి ఆశ .. దుర్యోధనుడు, దుశ్శాసనుల ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్....... అయింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371(d) అడ్డంకి కాదని సాక్షాత్తు హైకోర్టే తేల్చిపారేసింది. ఇక వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, పార్లమెంట్ ఫంక్షనింగ్ కి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందా? ఈ లోపు కావలసిన కార్యం కాస్త సంపూర్ణం అవుతుంది.
స్వార్థపరులు ఎంత పోరాడినా అధర్మం ఏనాటికీ గెలవదు. అందునా ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచిన దీర్ఘ కాలపు ధర్మపోరాటానికి దైవబలం ఎక్కువ.


Saturday 26 October 2013

అరె.... జర అర్థం జేస్కోండి బయ్!

గిది "ఫేస్ బుక్" లో కనిపించింది. చదివి జర అర్థం జేస్కోండి బయ్!



Thursday 10 October 2013

ఢిల్లీ పెద్దలకు తెలుగు వారంటే గౌరవం లేదా?


దాదాపు డెబ్బయి రోజులు సమ్మె చేసినా, చివరికి విధ్వంసం సృష్టించినా కేంద్రం తమను కనీసం పట్టించుకోలేదని, పాపం! సీమాంధ్రులు వాపోతున్నారు. అవును.... ఎందుకు పట్టించుకొంటారు?
పదమూడేళ్ళుగా మీ తోటి సోదరులు ఉధృతంగా ఉద్యమం చేస్తుంటే మీరు పట్టించుకొన్నారా? వారి మనసులోని బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారా? సమైక్యంగా ఉండడానికి వారికేం కావాలో కనుక్కొన్నారా?  కనీసం జరిగిన తప్పులు సరిదిద్ది, మళ్ళీ ఆ తప్పులు జరగవని హామీ ఇచ్చి అనునయించారా? లేదే!


పైగా.... ఎదురు దాడి చేసి, తెలంగాణ ప్రజలు చెప్పినవన్నీ అబద్ధాలనీ, కళ్ళముందు ఒళ్ళు తగులబెట్టుకొని ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గురించి కనీస కారుణ్యం లేకుండా అవహేళన చేశారు.
ఇదంతా ప్రపంచం గమనించలేదా? ఇంత దారుణంగా ప్రవర్తించినవారిని ప్రపంచం గౌరవిస్తుందా?
ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను అమాయికులుగా చేసి సీమాంధ్రులు ఆడుకొన్న విషయం అబద్ధమా?
నిన్నొక మాట.... నేడొక మాట.... సీమాంధ్రులు ఆ మాటకొస్తే పూటకొక మాట మార్చిన మాట అబద్ధమా?
ఇన్నాళ్ళు ఏ దోపిడీ జరుగలేదని బుకాయించి, ఇప్పుడు ఆ దోపిడీయే ఆగిపోతే మేం నష్టపోతామనడం అబద్ధమా?
న్యాయం, ధర్మం అన్నది ఆలోచించకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కౌంటరు ఉద్యమాన్ని చేయడం అబద్ధమా?
కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు ఇదంతా అర్థం కాలేదంటారా? ఇంకా వీళ్ళని ఎలా గౌరవిస్తారు?
గౌరవం ఒకరిస్తే తీసుకొనేది కాదు. తమ ప్రవర్తన ద్వారా, వ్యక్తిత్వాల ద్వారా సంపాదించుకొనేది!
ఇంకా ప్రపంచం దృష్టిలో పూర్తిగా పలుచనైపోక ముందే, సీమాంధ్రులు తమ పద్ధతిని మార్చుకొంటే వారికే మంచిది!




Tuesday 8 October 2013

సిగ్గు లేని జన్మలు ..... !!!

రాష్ట్ర డి.జి.పి. గా ఇటీవలే పదవీ విరమణ చేసిన దినేశ్ రెడ్డి ఈ రోజు .... సి.యం. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సోదరునితో  భూకబ్జాలు చేయించిన విషయం, ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయాలని తనను బెదిరించిన విషయం, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని కేంద్రానికి చెప్పమని ఒత్తిడి చేసిన విషయం, తెలంగాణను అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాల విషయం .... అన్నీ విడమరచి చెప్పి కుండ బద్దలు కొట్టారు.
ఇదీ సీమాంధ్ర సి.యం. గారి ఏలుబడి ..... సమన్యాయం .... !
ఇదిలా ఉంటే .... మాజీ డి.జి.పి. తను పదవిలో ఉండగా ఈ విషయం బయట పెట్టకుండా ఎందుకు సహకరించినట్టు .... ?
ఇదీ ఒక సీమాంధ్ర ఉన్నతాధికారి నిజాయితీ ..... !
వెంటనే సి.యం. ప్రతినిధిగా ఒక సీమాంధ్ర మంత్రి మాట్లాడుతూ ..... నలుగురైదుగురిని పక్కకు తప్పించి సి.యం. గారు డి.జి.పి. పదవిని దినేశ్ రెడ్డికి భిక్షగా వేసినట్టు ప్రకటించి, సి.యం. గారి అవినీతిని మరింత హైలైట్ చేసారు. "అందుకు కనీస కృతజ్ఞత లేకుండా సి.యం. గారి బండారాన్ని బయట పెడతావా?" అని మాజీ డి.జి.పి. ని ఆ మంత్రి ప్రశ్నించారు.
ఇదీ ఒక సీమాంధ్ర మంత్రి బరితెగింపు ..... !
ఇదిగో .... దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్టు .... ఇదీ సీమాంధ్రుల పరిపాలన !
ఇలాంటి పాలన కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి ..... ! దానికి తెలంగాణ ప్రజలు సహకరించాలి ..... !!
సిగ్గు లేని జన్మలు ..... !!!




Thursday 3 October 2013

జై తెలంగాణ


జై తెలంగాణ
జై తెలంగాణ
జై తెలంగాణ
 జై తెలంగాణ 
జై తెలంగాణ
 జై తెలంగాణ 
జై తెలంగాణ
జై తెలంగాణ


Saturday 28 September 2013

సీమాంధ్రులను యెదవల్ని చేసిన సీ.యం.


అధిష్టానం తెలంగాణను ప్రకటించగానే షాక్ కు గురైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజులు మంచం పట్టాడు. వారం తరువాత ఒక ఆలోచన ఫ్లాష్ అయింది. వస్తే కొండ .... పోతే వెంట్రుక ముక్క ..... అనుకొన్నాడేమో! సీమాంధ్ర ఎన్.జి.వో.లను ఎగదోశాడు. ఉధృతంగా ఉద్యమం చేయమన్నాడు. 2009 లాగే కేంద్రం పునరాలోచించుకొంటుందని ఆశించాడు. పది రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ఇరవై రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ముప్పయ్ రోజులు గడిచాయి.... ఫలితం లేదు. నలబై ..... యాబై ..... అరవై రోజులు గడిచాయి......... ఫలితం లేదు.
ఇక తప్పదు..... అధిష్టానం పట్టుదల చూస్తే జరిగేదేదో జరుగుతుందని అర్థమయింది. కాని "ఫలితం లేదు.... ఇక ఉద్యమం ఆపేయండి" అని సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు చెప్పలేడు. రెండు నెలల పాటు జీతాలు లేక, నానా ఇబ్బందులు పడి నష్టపోయిన ప్రజలను ఇప్పుడు "ఉద్యమం ఆపేయండి" అంటే తాట వొలుస్తారు. సీమాంధ్ర ప్రజలపై పిల్లులు, ఎలుకలపై ప్రయోగం చేసినట్టు చేసి ఫెయిలయ్యాక, రాష్ట్ర విభజన విషయంలో ఇక అధిష్టానానికి సహకరించక తప్పదు. కాని అలా సహకరిస్తే సీమాంధ్ర ప్రజలు నరికి పోగులు పెడతారు. అందుకని అధిష్టానానికి విధేయునిగా సహకరించే బదులు మరో రకంగా సహకరించేందుకు మరో నక్క జిత్తుల ప్లాన్ వేశాడు. ఎలాగూ అధిష్టానాన్ని ఎదిరించిన ఇమేజ్ వచ్చింది. అదే ఇంకా గట్టిగా ఎదిరిస్తే సీమాంధ్రలో హీరో కావచ్చు ..... అధిష్టానానికి, రాష్ట్రపతి పాలన పెట్టి వారి పని మరింత సులువయ్యేందుకు మార్గం ఏర్పర్చవచ్చు. ఇన్నాళ్ళు ఎవరినీ  రిజైన్ చేయకుండా ఆపినందుకు ఎలాగూ.... లోపాయకారిగా అధిష్టానం వద్ద మార్కులు  పడ్డాయ్. అంతగా అయితే .. తాను  లోపాయకారిగా  రాష్ట్రపతి పాలనకు కూడ సహకరించిన విషయం తరువాత అధిష్టానానికి వివరించి ప్రసన్నం చేసుకోవచ్చు.  
ఇంతకీ యెదవలయ్యింది ఎవరు? సీమాంధ్ర ప్రజలు! వాళ్ళు నిజంగానే యెదవలే .... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ముఖ్యమంత్రిని హీరో అని నమ్ముతున్నారు.     

    

Monday 23 September 2013

సీమాంధ్రులు ఈ పాటను చూసి, విని అర్థం చేసుకోవాలి!

అధర్మ "సమైక్యాంధ్ర ఉద్యమం" చేస్తున్న సీమాంధ్రులు ఈ పాటను చూసి, విని అర్థం చేసుకోవాలి. వ్యాపార దృష్టితో స్వార్థం పెరిగి, ధర్మాధర్మ విచక్షణ కోల్పోతున్నవాళ్ళకు ఈ పాట కొంతైనా కనువిప్పు కలిగిస్తుంది. పాటకై ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?v=3NoIbeMeuvA


Friday 20 September 2013

అయిపాయె..! ఇంకేమున్నది....?


తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది : చాకో
న్యూఢిల్లీ: ‘తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉందని విలేకరులు ప్రస్తావించగా...ఉద్యమాల ఒత్తిడితో వాళ్లు రాజీనామాలకు సిద్ధపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.


Wednesday 18 September 2013

తెలంగాణవాదం పల్లెపల్లెకు ఎలా పాకిపోయిందంటే..

తెలంగాణవాదం పల్లెపల్లెకు ఎలా  పాకిపోయిందో తెలుసుకోవాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?v=D8kbRA4IJ0k



Sunday 15 September 2013

సీమాంధ్రులు అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు....

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని నాళ్ళు ... తెలంగాణ ఉద్యమకారులు "సీమాంధ్రులు మా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు దోస్తున్నారు"  అంటుంటే -
సీమాంధ్రులు "తెలంగాణ ఉద్యమం అబద్ధాల పునాదులపై నిర్మించబడింది -
1. నీరు పల్లమెరుగు .. తెలంగాణ ఎత్తులో ఉంది. సహజంగా మాకు నీళ్ళు వస్తాయి .. ఇందులో మేము దోచిందేమీ లేదు.
2. నిధులు మేమేమి దోచడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ అవసరమయితే అక్కడ ఖర్చు చేస్తుంది.
3. ఉద్యోగాలు మేమేమి దోచలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేనే లేవు. ప్రైవేట్ ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి." అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా చెప్పుకొచ్చిన వాళ్ళే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు నీళ్ళు రావంటున్నారు.
ఎందుకు రావు? నీరు పల్లానికి ప్రవహించడం మానుకొంటుందా? లేక .. తెలంగాణ పల్లానికి దిగిపోతుందా?
అంటే.. ఇన్నాళ్ళూ నీళ్ళను అక్రమంగా దొబ్బి బుకాయించినట్టుగా బాజాప్తాగా ఒప్పుకొంటున్నట్టేగా!

రాబోయే తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టి తమ ప్రాంతానికి న్యాయం చేసుకొంటుందో .. సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో.. కేవలం తమ ప్రాంత స్వార్థం కోసమే, కావాలనే ఆ ప్రాజెక్టులను కట్టకుండా అక్రమంగా నీళ్ళు దోచుకొన్నారని సిగ్గు.. లజ్జ.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

సీమాంధ్రులు సమైక్య రాష్ట్రంలో నిధులు దోచకుండా ఉన్నట్టయితే.. ఇప్పుడు తెలంగాణ వేరయితే.. మేం గడ్డి తిని బతకాల్సి వస్తుందని, నిరసనగా గడ్డి తింటూ ప్రదర్శనలు చేస్తున్నారెందుకు సిగ్గు లేకుండా....?

సీమాంధ్రులు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు ఉద్యోగాలు రావంటున్నారు. 
సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడితే.. లేవనుకొన్న ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడ కొన్నైనా వస్తాయి. ఇక హైదరాబాదు ప్రైవేట్ ఉద్యోగాలు ఎలాగూ మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి. ఇక వాళ్ళకొచ్చిన నష్టమేమిటి? అంటే ఇన్నాళ్ళూ చెప్పిందంతా అబద్ధమన్నట్టేగా! అక్రమంగా, ప్రాంతీయ పక్షపాతంతో సీమాంధ్రులు ఉద్యోగాలు దొబ్బినట్టుగా సిగ్గు.. ఎగ్గు.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

తెలంగాణ వాళ్ళు కష్టమో.. నష్టమో.. మా బతుకులు మేము బతుకుతామంటున్నారు. కాని సీమాంధ్రులు అలా కాదు. వాళ్ళు ఎప్పుడూ పరాన్నభుక్కులే. ఆనాడు తమిళుల మీద పడితే.. వాళ్ళు తన్ని తగిలేశారు. ఇప్పుడు తెలంగాణ విడిపోతే మేం బతకలేమంటున్నారు. ఆనాడు మద్రాసును, ఈనాడు హైదరాబాదును మేమే అభివృద్ధిని చేశామనే వీళ్ళు.. ఇప్పుడెందుకు ఇంత చతికిలబడుతున్నారు. దీన్ని బట్టి తెలియడం లేదా?  వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో! వీళ్ళపై వీళ్ళకు ఉన్న ఆత్మ విశ్వాసం ఎంతో!! ఇంత దుర్బల జాతిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇంత దౌర్బల్యం ఉన్నవాళ్ళు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను భాష.. సంస్కృతి.. అంటూ ఎందుకు చిన్న చూపు చూశారు. అహంకారంతో ఎందుకు అవహేళనలు చేశారు? తెలంగాణ విడిపోతె బతకలేమనుకొన్న వారు ఎందుకు అణకువగా ఉండి ఆ ప్రాంత ప్రజల ప్రేమను సంపాదించుకోలేదు. ఈ రోజు ఏ తెలంగాణ పౌరుణ్ణైనా అడిగి చూడండి. సీమాంధ్రుల ఈసడింపులు, వెటకారాలు, కుటిలత్వాల గురించి పుంఖానుపుంఖాలుగా వివరిస్తారు.

ప్రపంచంలో ఎక్కడయినా "మాకు స్వేచ్చ కావాలి" అని ఉద్యమిస్తారు. కాని ఎదుటి వాడికి స్వేచ్చ ఇవ్వరాదని పోరాడరు. పైగా ఆత్మాభిమానంతో.. "పోతే ఫోండి.. మీకు లేనప్పుడు మాకేంటి?" అంటారు.  కాని సిగ్గు.. ఆత్మాభిమానం.. చంపుకొని, దౌర్జన్యకారుల్లాగా "మీరు చచ్చినట్టు మాతో కలిసి ఉండాలి" అనరు. 

ఇప్పుడు సీమాంధ్రుల ’సమైక్య ఉద్యమం’ చూసి ప్రపంచమంతా నవ్వుకొంటోంది. ఈ ఉద్యమం ద్వారా సీమాంధ్రులు తమను తాము - "అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు...." అని చాటుకొంటున్నారు.

Thursday 5 September 2013

సిగ్గు.. షరం.. ఉన్నవాళ్ళయితే!!!

విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ....
మాకూ ఔదార్యం అక్కర్లేదు. మేమూ నిక్కచ్చిగానే మాట్లాడుతాం.

సీమాంధ్రులకు ఉమ్మడిగా  హక్కుండేది హైదరాబాదు ప్రభుత్వ ఆస్తుల పైనే.
ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారినా.. ఏ రాష్ట్రాలు ఏర్పడినా.. ప్రైవేట్ ఆస్తుల పైన హక్కు ఆ యా వ్యక్తులకు లేదా సంస్థలకే ఉంటుంది.
హైదరాబాదు మీద మాకు హక్కుందనే సీమాంధ్రులకు కనీసం ఈమాత్రం ఇంగిత జ్జానం ఐనా ఉండాలి.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పన్నులతో, ఉమ్మడి ప్రభుత్వ ఆదాయంతో 1956 నుండి 2013 వరకు అభివృద్ధి చెందిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాలపై తెలంగాణ ప్రజలకు హక్కుంది.
సిగ్గు.. షరం.. ఉన్నవాళ్ళయితే....
5 నగరాల అభివృద్ధిలో మా వాటా ఎంతో తేల్చండి.
ఆ పైన హైదరాబాదులో మీ వాటా ఎంతో లెక్కలు తేల్చండి.
చెల్లుకు చెల్లు.... హళ్ళికి హళ్ళి ....
హైదరాబాదును యూటీ చేస్తే పై 5 నగరాలనీ యూటీలుగా మార్చాలి.

మాది మాకే.. మీదీ మాకే అనే సిగ్గు.. షరం.. లేని బతుకులు మీవి కాబట్టే మేమ్ మీతో కలిసుండలేమనేది

విడిపోయేప్పుడు కూడా అవే చిల్లర బుద్ధులా

Tuesday 27 August 2013

సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే! - 2

సీమాంధ్రులు సాగిస్తున్న కుహనా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడ చూచినా పొట్టి శ్రీరాములు గారి ఫ్లెక్సీలే!
ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు!!
ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమని వీర ప్రసంగాలు.. విభజన వాదం వినాశకరమని, ఐకమత్యమే బలమని ఊకదంపుడు ఆదర్శాల ప్రకటనలు...
వీళ్ళ పచ్చి అబద్ధాలకు అంతుందా?
అసలు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ ఉపవాస దీక్షకు కూర్చున్నది మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని (అప్పటికి ఇంకా తెలంగాణ ప్రస్తావనే లేదు) ఏర్పర్చాలని...  19.10. 1952 నాడు.
ఆయన పక్కా విభజన వాది!
ఆయన ఆత్మార్పణ జరిగింది (నిజానికి సీమాంధ్రులు ఆనాడు మద్రాసు తమకు దక్కదని తెలిసీ దురాశతో ఆయన చావును కళ్ళ చూశారు) 15.12.1952 నాడు.
 ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడింది 01.10.1953 నాడు.
అప్పటికే తెలంగాణ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంది.
ఆ పైన దేశంలో 4వ పెద్ద నగరమైన మద్రాస్ నగరాన్ని సాధించుకోలేకపోయిన సీమాంధ్రులు 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ నగరంపై కన్నేసి 3 సంవత్సరాలు లాబీయింగ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా ... "పెద్దమనుషుల ఒప్పందం" అంటూ మాయ మాటలు చెప్పి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొన్నారు.
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారు గతించిన 4 సంవత్సరాల తరువాత  01.11.1956 నాడు.
ఇదీ చరిత్ర !!!
ఇన్నీ తెలిసీ ... పాఠ్య పుస్తకాల్లో సైతం - "పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది" అని బోధిస్తున్నారంటే ... సీమాంధ్ర పాలకులు, మేధావులు ఎంత అబద్ధాలకోరులో .., కుట్రదారులో చూడండి.
ఉపవాస దీక్షకు కూర్చునే ముందు పొట్టి శ్రీరాములు గారు పత్రికలకు అందించిన బహిరంగ లేఖలోని ఈ ముఖ్య భాగాన్ని చూస్తే చిన్న పిల్లాడికైనా ఈ విషయం అర్థమౌతుంది.
















































































ఇంకా విశదంగా తెలుసుకోవాలంటే ఈ లింకులపై క్లిక్ చేసి చదవండి.

http://aksharsatya.blogspot.in/2013/08/blog-post_8639.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3317.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_4444.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_27.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3888.html

("అక్షర సత్యాలు", "కోటి రత్నాల వీణ" బ్లాగర్లకు ధన్యవాదాలతో )

Sunday 25 August 2013

సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే!!

ఊసరవెల్లి "ఉండవల్లి" ఒక మీటింగ్ పెట్టి "తెలంగాణ వాళ్ళు రా.. రా.. అని పిలిస్తే మేము వచ్చి కలిసాం" అనగానే సీమాంధ్రులంతా (ముఖ్యంగా కుహనా సమైక్య బ్లాగర్లు) రెచ్చిపోయారు.
"సీమాంధ్రులు నోరు తెరిస్తే అబద్ధాలే!" అని నిరూపించారు "అక్షర సత్యాలు" బ్లాగరు శ్రీ మల్లికార్జున స్వామి గారు. ఆయనకు హృదయ పూర్వక అభినందనలు!
ఈ పేపర్ కటింగ్ (1955) లను చూడండి.







Monday 19 August 2013

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు?

ఇదేనా సమైక్యమంటే? వీళ్ళా సమైక్యవాదులు? అసలు వీళ్ళు భారతీయులేనా?
నిజానికి వీళ్ళే అసలైన "తెలబాన్లు"! తిన్నింటి వాసాలు కూల్చే "స‘మెక్కు‘ సాలెగాళ్ళు"!


నిజమైన తెలుగు బిడ్డ నిజాయితీ మాట ...


ఆంధ్రా ప్రాంతలో పుట్టి పెరగడం, తెలంగాణంలో నివసించడం వలన ఇరు ప్రాంతాలలో జరిగే ఉద్యమాలను దగ్గరగా చూసే అవకాశం, అనుభవం ఉంది. ఈ మొత్తం ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది, తిరుగుతూనే ఉంది. ఇరు ప్రాంతాలలోనూ నాపై కొంత వ్యతిరేక భావన ఉండడం గమనార్హం. ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత ఎందుకంటే నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కావడం. తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేక భావన కలుగడానికి కారణం నేను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడను కావడం. ఆంధ్రా వాడు ఎప్పటికైనా ఆంధ్రావాడే అవుతాడు కాబట్టి అనేది సాధారణ అవగాహన అయి ఉండవచ్చు. ఏది ఏమైనా అవి నా మీద కలగిన భావనలే అయినప్పటికీ, నాలో కలిగిన భావనలు కాదు కాబట్టి నేను పెద్దగా బాధ పడవలసిన అవసరం లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయిన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో కొన్ని అనుభవాలు భలే గమ్మత్తుగా అనిపించాయి. అవేవనగా
(1)   బహుశా నాలుగేళ్ళ క్రితం అనుకుంటా? Hair saloon కి వెళ్లాను. అక్కడ Barber కి నాకు జరిగిన సంభాషణ ఇలా వుంది.
బా: ఈ తెలంగాణా గొడవ జరుగుతుంది కదండీ? మీ కెలా వుంటుందండీ? Problem ఏమీ లేదా?
నేను: అబ్బే మాకలాంటి సమస్యలేమీ రాలేదు? అయినా నేను తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకిని కాను.
బా: అదెలాగా? మీరు ఈ ప్రాంతానికి చెందిన వారై, వాళ్లకు ఎలా support చేస్తారు.
నే: నేను support చేసేది ప్రాంతాన్ని బట్టికాదు. వాళ్ళ demand లో సామాజిక న్యాయం ఉంది. అందుకే నా నైతిక మద్దత్తు ఆ ఉద్యమానికి ఉంది.
బా: (గట్టిగా నవ్వి) మీరు భలే తెలివైన వారండీ? ఏ ఎండకా గొడుగు పడతారన్న మాట. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మాట్లాడుతున్నారా?
నే: నాకు అంత భయం లేదు సార్. నా మద్దత్తు ఇవ్వడానికి సరిపడా అన్ని కారణాలు అక్కడ ఉన్నాయి. అంతే.
బా: మీకు తెలంగాణా వాళ్ల గురించి మీకు తెలియదు సార్. అక్కడ తెలంగాణా ఇచ్చేస్తే మనం ఆకలితో చచ్చిపోతాం.
నే: అవునా ఏమిటది (నేను అప్పటికి 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాను)
బా: అవునండీ! వాళ్ళుమనకి నీళ్ళు రానివ్వరు. ఈ సస్యశ్యామలమైన ఈ నేలలో మీరు కరువు చూడవలసి వస్తుంది. మనం తిండి లేక చనిపోవాల్సి వస్తుంది.
(నేను గట్టిగా నవ్వేను)
బా: మీరు నవ్వకండి. మీకంత వయసులేదు. మీకు ఇప్పుడు అర్ధం కాదు.
నేను: రాష్ట్రం రెండుగా విడిపోవడం వలన మీరు నడిపే ఈ బిజినెస్ కి ఏమైనా నష్టం వస్తుందా?
బా: రాదు, కానీ, హైదరాబాదుని మనమే develop చేసాము.
నే: ఏమోనండి నాకు తెలియదు. మా కుటుంబం నుండి హైదరాబాదు వెళ్ళినోడిని నేనొక్కడినే. నేను వెళ్ళింది చదువుకోవడానికి మాత్రమే. హైదరాబాదు అభివృద్ది చేయడంలో నాకు గానీ, మా కుటుంబానికి గానీ ఏ విధమైన పాత్ర లేదు.
బా: (కళ్లల్లో కోపం) మీకంత వెటకారం అవసరం లేదు. మీకసలు సమస్యే అర్ధం కావడం లేదు (మాటల్లో చెప్పలేని చిరాకు). [అప్పటికే అతని కత్తి నా గడ్డం గీస్తూ ఉంది. ఈ మాటల సందర్భంలో అది నా గొంతు దగ్గర ఉంది. రాష్ట్రం కన్నా ప్రాణం ముఖ్యం అనిపించింది. నేను ఇక అతనితో మాట్లాడలేదు. నాతో నేను మాట్లాడుకోవడం మొదలెట్టాను “ఇంత భయాన్ని పోగొట్టెదెలా?”.
(2)   ఈ వారంలో నేను మా అమ్మకు ఫోన్ చేసాను. ఎక్కడున్నావు అంటే ’చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము’ అంది. ఎందుకో అని కాకతాళీయంగా అడిగిన నాకు ’సమైక్యాంధ్ర కోసం, శాంతి కోసం’ అన్న సమాధానం నాలో అశాంతిని రేకెత్తించింది. నేను మళ్ళీ అడిగాను “అమ్మా! సమైక్యాంధ్రా కోసమా? శాంతి కోసమా?’. బహుశా ఇది చాలా పిచ్చి ప్రశ్నలా మా అమ్మకి అనిపించి ఉండవచ్చు. “అదేమిటి బాబు, సమైక్యాంధ్ర వస్తే శాంతి వచ్చినట్టే కదా’ అంది. అప్పుడు నేను తమాయించుకొని ఇలా చెప్పాను, “సమైక్యంగా ఉండడం వలననే గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది. ఆ అశాంతిని తొలగించి, శాంతిని నెలకొల్పడానికే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చింది. నువ్వు/ మీరు ఉపవాస ప్రార్థనలతో సమైక్యాంధ్రాను తెచ్చేస్తే పోయిన అశాంతిని తిరిగి తెచ్చినట్టే కదా అమ్మా” అన్నాను. మా అమ్మకేదో అర్ధమయ్యినట్టుంది. ’అలాగా! మరి హైదరాబాదు నుండి మన వాళ్లను పంపించేస్తారట?’ అని అడిగింది. బహుశ ఇది వారి ప్రార్థనలో రెండో అజెండా అయి ఉండవచ్చు. ఇక నుండీ మా సంభాషణ కొంత ఆశక్తికరంగా జరిగింది.
నేను: చాలా మంచి ప్రశ్న అమ్మా. అదే నిజమైతే నేను ఇప్పటికే వచ్చేసి ఉండాలి కదా?
అమ్మ: అవును, కానీ నువ్వు రాలేదు
నేను: పోనీ శరీన్ (సోదరుడు) వచ్చేసాడా?
అమ్మ: లేదు
నేను: మమ్మల్ని వదిలేయ్. పార్వతి కుటుంబం (carpenters in hyd) ఎవరైనా వచ్చారా?
అమ్మ: లేదు
నేను: ఇవన్నీ కాకపోయినా, నీకు తెలిసున్న వాళ్ళు ఏ ఒక్కరైనా వచ్చేసారా?
అమ్మ: లేదు
నేను: అలాంటప్పుడు ఇక్కడనుండి అందరినీ పంపించేస్తారన్న మాట వాస్తవమేనా?
అమ్మ: కాదు, మరి అందరూ అలా ఎందుకు చెబుతున్నట్టు
నేను: రాజకీయం మమ్మీ. భయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మొత్తం విశయాన్ని అర్ధం చేసుకోవడానికి నీకు మనకు బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. మనం మరియు మరికొన్ని కుటుంబాలు ఉద్యోగ రీత్యా జీవితంలో సింహ భాగం మన జిల్లా ఆదివాసీల ప్రాంతంలో గడిపాము. మీరు ఆ ఊరికి వెళ్ళే సరికి కరెంటు కూడా లేదు. అలాంటి ఊరిలో పీటర్ (తాతయ్య) గారు ప్రతీ కార్యక్రమంలో ముందుండి ఆ ఊరి అభివృద్దికి తన వంతు సాయాన్ని అందించారు. దానికి అక్కడున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు సహకరించారు. పీటర్ గారు ఒక స్థాయి గౌరవాన్ని అనుభవించారు. ఇలాంటి సమయంలో ఆయన ఈ ఊరిని నేనే అభివృద్ది చేసాను. ఈ ఊరు నాది అని అంటే ఎవరైనా ఊరుకుంటారా?
అమ్మ: ఎందుకు ఊరుకుంటారు
నేను: కదా! ఆ ఊరులో ఇల్లు కొనుకున్నారు, పొలం కౌలుకి తీసుకున్నారు. ఉద్యోగ విరమణ సమయం వరకూ అక్కడే ఉన్నారు. విరమణ తరువాత తమ సొంత ప్రాంతానికి వచ్చేసారు. అలాకాకుండా అక్కడే ఉండిపోయినా సమస్య ఏమీ ఉండదు. కానీ ఇది నాది, నేను మాత్రమే అభివృద్ది చేసాను అంటేనే సమస్య మొదలవుతుంది. హైదరాబాదు సమస్య అలాంటిదే? పెద్ద కొట్టు బాబూరావు, చిన్ని కృష్ణ, జ్యోతుల వెంకట్రావు, సైకిల్ షాపు రాంబాబు లాగా సమాజానికి అవసరమైన వస్తువులను అందించే వ్యాపారం చేసినంత వరకూ ఎవ్వరూ ఏమీ అనరు. మా వల్లే ఈ ఊరు అభివృద్ది చెందింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ’అశాంతి’ వస్తుంది. లాజిక్ అర్ధమయ్యింద అమ్మా?
అమ్మ: అర్ధమయ్యింది బాబూ. వీళ్లందరూ చెబుతుంటే అదే నిజమనుకున్నాను.
నేను: హ హ హ. ఇప్పుడర్ధమయ్యిందిగా. ఈ శుభవర్తమానమును సర్వలోకమునకు తెలియజేయండి. వెళ్లండి.
(అమ్మ నవ్వింది. నా పని ఇప్పుడే మొదలయ్యింది)

Posted by Suresh Kumar Digumarthi (A research scholar in political science at Hyderabad) in his blog "Singing in the Train"

Saturday 10 August 2013

హైదరాబాద్ తెలంగాణదే!!!


’ఏబిఎన్-ఆంధ్రజ్యోతి’ ఛానల్ ( సీమాంధ్ర ఛానలే ) వారు ’జెస్ట్ వింగ్స్’ సంస్థ వారి అధునాతన సాంకేతిక సహకారంతో హైదరాబాద్ గురించి హైదరాబాద్ ప్రజల ( అన్ని వర్గాలకు చెందిన 5.67 లక్షల మంది ) నుండి జరిపిన ’అభిప్రాయ సేకరణ’లో -
"తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండాలి" అన్నవారు = 46.57% మంది.
"హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలి" అన్నవారు ( "పదేళ్ళు ఉమ్మడి రాజధాని" అంటే... ఆ తరువాత అది పూర్తిగా తెలంగాణకు చెందాలని అంగీకరించినట్టే ) = 20.37% మంది.
వెరసి "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని అంగీకరించినవారు మొత్తం = 66.94% మంది.

అంటే "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని హైదరాబాద్ లో మూడింట రెండు వంతుల భారీ మెజారిటీ ప్రజలు కోరుకొంటున్నారు.
ఇంక వివాదం ఎక్కడుంది?
ఈ రెఫరెండంను సీమాంధ్రులు గమనించాలి! గౌరవించాలి!!!



Friday 9 August 2013

దోపిడీదార్లమని ఒప్పుకొన్నట్టె కద! సిగ్గు! సిగ్గు!!

పదమూడేళ్ళుగ తెలంగాణ వాళ్ళు సమైక్య రాష్ట్రంలో మా నీళ్ళు, నిధులు, నియామకాలు దోపిడీకి గురవుతున్నయంటే ససేమి కాదని వితండ వాదం చేస్తున్న సీమాంధ్రులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే నీళ్ళ జగడాలు మొదలవుతయి అంటున్నరు.

 అంటే ఇన్నాళ్ళు నీళ్ళ విషయంలో ఏదొ కిరికిరి ఉన్నట్టె కద!

హైదరాబాదు లేకపోతే మాకు నిధులు సరిపోవు అంటున్నరు. అంటే ఇన్నాళ్ళు నిధుల విషయంలో ఏదొ గడబడ్ చేసినట్టె కద!

మా ఉద్యోగాలకు భద్రత లేదు అంటున్నరు. మా పిల్లలకు ముందు ముందు ఉద్యోగాలు రావు అంటున్నరు. వీధుల్లో పడి విధ్వంసం సృష్టిస్తున్నరు. అంటే ఇన్నాళ్ళు నియామకాల విషయంలో మోసం చేసినట్టె కద!

ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ఉన్నది. రేపు కొత్తగ ఏర్పడె రెండు రాష్ట్రాలు భారత దేశంలోనే ఉంటయి. అప్పుడైన, ఇప్పుడైన భారత రాజ్యాంగానికి లోబడె పని చేస్తయి. మరి్ ఇప్పుడు కొత్తగ రెండు రాష్ట్రాలు ఏర్పడితె, రాజ్యాంగ బద్ధంగ వచ్చేటివి ఎందుకు రావు? అంటే ఇన్నాళ్ళు రాజ్యాంగానికి అతీతంగ అక్రమంగ అవన్ని సీమాంధ్రులు దొబ్బుతున్నట్టె కద! 

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు వేరొక ప్రాంతం వాళ్ళని EXPLOIT చెయ్యక పోతె .... ఒక ప్రాంతం వాళ్ళు మేం వేరుపడుతం అంటె వేరొక ప్రాంతం వాళ్ళు అంతే పౌరుషంగ "పోతె పొండి. మేం గూడ వేరు పడుతం" అనాలె. ఎందుకంట లేరు?
అసలు తెలంగాణతో విడిపోతె మా బతుకులు కుక్క బతుకులవుతయి అంటున్నరంటే ఇన్నాళ్ళు తెలంగాణను జలగల్లాగ పట్టి పీక్క తిన్నట్టె కద!

ఇంత సిగ్గు, లజ్జ లేకుండ నడి వీధులలో నగ్నంగ నిల్చుని, మేం అరవై ఏళ్ళనుండి దోపిడి చేసినమని చాటుకోడం ఏంది? ఇదంత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి సపోర్ట్ చేసుడేంది? సిగ్గు చేటు!

ఏమన్నంటే ... హైదరాబాదుని మేం డెవలప్ జేసినం అంటరు. ఏం? మా తెలంగాణవాళ్ళు టాక్సులు కట్టలేద? ఎప్పుడైన కలిసి ఉన్నప్పుడు అందరు కలిసె కట్టుకొంటరు. విడిపోయినాక ఎవరిది వాళ్ళు కట్టుకొంటరు. ఇది ఒకడు చెప్పాన్నా? సీమాంధ్రుల దిమాఖ్ కెక్కద? 
అయినా ఏం డెవలప్ జేసినరు? లగడపాటి లాంకో హిల్స్ లొ తెలంగాణ పేదోడికేమన్న ఇచ్చినడా? కావూరి కట్టిన రోడ్లలో తెలంగాణ వాళ్ళకి  ఏమన్న టోల్ టాక్స్ ఫ్రీయా? మీ వ్యాపారాలు, మీ డబ్బులు మీరు చూసుకొన్నరు.

మీ సిగ్గు లేని వాదనలు విన్న దేశంలోని అన్ని పార్టీల ముందు మీరు నవ్వులపాలయితెనె గదా.... తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఇంకెంత కాలం ఇజ్జత్ తీసుకొంటరు?


Thursday 1 August 2013

అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.


ఇంకా కొందరు సీమాంధ్రులు కేవలం  బెదిరింపులు, సెంటిమెంట్లకు లొంగి తెలంగాణ ఇచ్చేసారనడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణకు ఏ అన్యాయం జరగకుండానే ఇంతమంది జాతీయ పార్టీల నాయకులు తెలంగాణకు మద్దతిచ్చారా? ఏ అన్యాయం జరగకుండానే, లోపల ఇష్టం లేకున్నా మన రాష్ట్ర పార్టీలన్ని బయటికి మద్దతిస్తున్నామని ప్రకటించవలసి వచ్చిందా? వీళ్ళందరి కన్నా సీమాంధ్ర వితండ వాదులు తెలివైనవారా? వీరి వాదన బలమైనదా?
మొన్నటికి మొన్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయవలసిన ముఖ్యమంత్రి ఒక్క చిత్తూరు జిల్లా ఉత్సవాలకు 700 కోట్లిచ్చి, 10 తెలంగాణ జిల్లాల కాకతీయ ఉత్సవాలకు 120 కోట్లిచ్చాడు. అదేమిటని హరీష్ రావు అసెంబ్లీలో నిలదీస్తే - "తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను..  రాసి పెట్టుకో ... " అని అహంకారంతో విర్రవీగలేదా? పాత కాలంలో నడిచి పోయింది గాని, కమ్యునికేషన్లు ఇంతగా అభివృద్ధి చెందాక  ఇదంతా దేశ  నాయకులు, ప్రజలు చూడడం లేదనుకొంటున్నారా ?
బెదిరింపులు, సెంటిమెంట్ల కథలు చెప్పి తెలంగాణను ఆపాలని చూస్తున్నది సీమాంధ్రులు!
కలసి ఉండాలంటే ఇద్దరి అంగీకారం ఉండాలన్నది సాధారణ ప్రజాస్వామిక సూత్రం. నా కిష్టం లేకపోయినా, నువ్వు చచ్చినట్టు నాతో కలసి ఉండాల్సిందే అనడం ఏం న్యాయం?
వీరి మూర్ఖత్వానికి, దౌర్జన్యానికి అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.


Tuesday 30 July 2013

ఫలించిన జోస్యం


03-05-2013 నాడు ఈ బ్లాగులో ప్రచురించిన పోస్టును ఈ క్రింది లింక్ ద్వారా చూడండి.
అప్పటికి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ దిశగా అడుగులు వేసిన దాఖలాలు కూడ లేవు. పైగా ఈ జోతిష్య సమాచారం గత మూడు నాలుగేళ్ళుగా ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది. అదంతా అక్షర సత్యంగా ఇప్పుడు ఫలిస్తోంది.
ఇలాంటివి చూసినప్పుడే జోతిష్య శాస్త్రంపై నమ్మకం పెరుగుతుంది. జోతిష్య శాస్త్రవేత్తలు ఫెయిల్ అవవచ్చు గాని, సమర్థుడైన జోతిష్య శాస్త్రవేత్త చెప్పిన జోతిష్య శాస్త్రం ఫెయిల్ అవ్వదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. పై జోతిష్య సమాచారం అందించిన ఆ శాస్త్రవేత్త ఎవరో .... ఆయనకు పాదాభివందనాలు! 

http://pannagashayi.blogspot.in/2013_05_01_archive.html

Monday 29 July 2013

కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 2

ఇటీవల "మనవు" అన్న బ్లాగులో రాసిన ఒక పోస్ట్లో ప్రతి మాటా అక్షర సత్యం.
ఆ పోస్ట్ ఇది ....

"సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?

                                                                          



K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు  రాజకీయంగా  పావులు కదపటంలో  చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు  o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే  k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo  లో అతి శయోక్తి లేదు .

  ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే ఆయన గారి పదిరోజుల నిరాహార దీక్ష కదా కార్యక్రమాలు . ఇవ్వన్ని అధిష్టాన దేవత అంగీకారంతో జరిగినవె. ఆ రోజు భారత హోం మంత్రి చేత ప్రకటన చేయించాక ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిపొఇదనుకున్నాదు.

   అంతే !అప్పటి దాక తెలంగాణా ఇస్తే మాకేమి అబ్యంతరం లేదని బింకపు మాటలు మాట్లాడిన ఆంద్ర రాజకీయ దిగ్గజాలు ఒక్క సారిగా నివ్వెర పొయారు. అప్పటి దాక తెలంగాణా  ఇవ్వడం అనేది అయోధ్యలో  రామాలయం  కట్టడం లాంటిది అనుకున్న అంద్రా వారు ఒక్కసారిగా ఆంద్రా ప్రజలు నిరసన తెలపడంతో అయోమయానికి గురిఅయి ఒక్క సారిగా మూకుమ్మడి రాజీనామాలు చేసే సరికి  ఈ సారి  తెల్లబోవడం సోనియా గాంది గారి వంతయింది . అదేమిటి ! అంతకు ఒక్క రోజు మునుపే ఒక్క c.p.m. వారు తప్పా ,అందరూ తెలంగాణా ఇస్తే తమకేమి అబ్యంతరం లేదని రాత పూర్వకంగా తెలియ చేసి ,తెల్లారి ఇచ్చేసరికి ఇలా మాట మార్చడం ఇటాలియన్ సోనియా గారికి అస్సలు అర్ధం కాలెదు. ఈ రోత రాజకీయాలు చూసి ఆమెకు అసహ్యం కూడా వేసి ఉండవచ్చు. కాని రాష్ట్ర రాజకీయాలలో అనుబవమున్న వారు ఇచ్చిన సలహాతో కావచ్చు తాత్కాలికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపి ఉంటారు
      భారత దేశం వంటి పెద్ద దేశానికి చెందిన అదికార పార్టికి ఆమె అధిష్టాన దెవత. ఆమె మాట ఇస్తే తప్పుకునే రకం కాదు.అందులో తన పుట్టిన రోజున నాలుగు కోట్ల మంది ప్రజలకు అందరి ఆమోదం తో ఇచ్చిన మాట అది. అది ఆమె జన్మదినo   నాడు ఇచ్చిన వరం . అటువంటి దానిని ఆమె వెనుకకు తీసుకుంటుందా? తీసుకుని తన చరిత్రలో ఒక మచ్చని ఏర్పర్చుకుoటుందా ? నెవ్వర్! ఇది తెలిసిన వాడు కాబట్టే k.c.r నిమ్మకు నిరేట్టినట్లు ఉంటూ తన పాంహౌస్ లో కాలం గడుతున్నాడు . అది తెలియని వారు డబల్ గేం రాజకీయాలతో ఇంకా ప్రజల్ని మబ్య పెట్టాలని చూస్తున్నారు .. నాన్నా పులి వచ్చె కదలొ కొండయ్య కొడుకు లాగ పిల్ల చేష్టల రాజకీయాలతో ఆటలాడిన రాజకీయ నాయకులు ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటును కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్పా , అసలు ప్రజల మనో బావాలు ఏమిటి ? వాటిని తెలియ పరచడంలో పార్టి సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఎలా వ్యవహరించాలి అనేది ఇప్పటికి వారికి అవగతం అయినట్లు లెదు.  నైతిక విలువలతో  కూడిన రాజకీయాలే మన రాష్ట్రానికి , దేశానికి శ్రీ రామ రక్ష అని రాజకీయ వాదులు గ్రహిస్తే మంచిది . అలా ఒకే మాట మిద వ్యవహరించిన  T.R.S.,C.P.M, పార్టీలకు అభినందనలు . డబల్ గేం రాజకీయ నేతల నైజంతో ప్రజల మనో బావాలు సరిగా వెల్లడి కావు అనటానికి చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ గా మిగిలి పోనుంది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు. ఇప్పటి కైనా ప్రజలు మాటలు చెప్పే వారిని కాక మాట మిద నిలబడే వారిని ఆదరిస్తే సర్వ విధాలా శ్రేయో స్కరమ్."    
("మనవు" బ్లాగు ఓనర్ కు ధన్యవాదాలతో .....)


సీమాంధ్ర పార్టీల, ఆయా పార్టీల నేతల ద్వంద్వ నీతికి కాంగ్రెస్ అధిష్ఠానం తగిన బుద్ధి చెప్పింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ!!!

Sunday 28 July 2013

కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 1


అనేక ఒప్పందాల, జీ.వో.ల ఉల్లంఘననను నిరసిస్తూ,
అరవై ఏళ్ళుగా నిధులు, నీళ్ళు, ఉద్యోగాల పంపకంలో జరుగుతున్న వివక్షను అంతం చేయడానికి
అస్థిత్వ వాదం, ఆత్మ గౌరవం, ప్రజల ఆకాంక్ష అనే ప్రజాస్వామిక అంశాలతో
తెలంగాణవాదులు ఉధృతంగా జరిపిన ఉద్యమ ఫలితంగా
ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే....
సీమాంధ్ర నాయకులు ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాలు అంటూ దొంగ లెక్కల కారణాలు చూపి అడ్డుకొన్నారు. ఇప్పుడు అదే ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాల లెక్కలే చూపుతూ
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొని అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.
పాపం సీమాంధ్ర నాయకులు! ఇప్పుడేం చేస్తారు?
"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" అంటే ఇదే!