Sunday 24 July 2011

సీమాంధ్ర కవులేమంటున్నరు?

ఇద్దరు పేరుమోసిన సీమాంధ్రకవులు నిష్పాక్షికంగా చెప్పిన తమ మనసులోని మాటలు చూడండి.


7 comments:

  1. ‎'సింగిడి' వారి బూతు కవితలు
    'సింగిడి' ( తెలంగాణా రచయితుల సంఘమట! ) వారి శ్రావ్యమైన బూతు కవితలు http://tinyurl.com/3j9dxuf
    చదివి వినిపించి తరించండి
    బూతులను కవితల రూపంలో అల్లడం ఒక అపురూపమైన కళ
    మరి విద్వేషం అనే విషాన్ని పేజీలపై చిమ్మడమనేది అందరు కవులకు సాధ్యపడదు
    మీలో ఎవరైనా బూతు కవిత్వం చెప్పే వాళ్ళుంటే 'సింగిడి' బూతు రచయితుల సంఘానికి తప్పక పంపించండి...

    ReplyDelete
  2. సీమాంధ్ర ప్రజలారా! గమనించండి.
    పేరు మోసిన సీమాంధ్ర కవులు ఏమంటున్నరో నేను చూపితే - వీణ్ణి చూడండి.
    విద్వేషాలు పెంచి రక్తం కళ్ళ చూడడం వీడి చరిత్ర.

    ReplyDelete
  3. అయ్యా! Shayi గారు. తెలుగువారి రాజధాని " హైదరాబాద్ " . రాష్ట్రానికి సంబందించిన మౌలిక సదుపాయాలన్ని ఒక్క రాజధాని నగరానికే వస్తాయి. అది సహజం..మన రాజకీయ నాయుకల దౌర్భాగ్య మానస్థితి. అంతె కాని ఏ ఒక్క ప్రాంతాం మాత్రమే మనుషులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దదు. ఇదే రాజధాని వైజాగ్, కర్నూల్‌లాంటి ప్రాంతాలలో ఉండూంటే అప్పుడు కూడా ఇప్పుడు చెబుతున్న ఈ మాటల్నే అక్కడ వల్లించే వారు.." మేము తెలంగాణ లేక కోస్తా లేక రాయలసీమలలో పుట్టినా మాకు దారిచూపింది కోస్తా(సీమాంద్ర)/రాయలసీమ (కర్నూల్) ప్రాంతమే " అని చెబుతారు. అది సహజం అంతే గాని కేవలం తెలంగాణకు వచ్చారు కాబట్టి వారికిపేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పుకుంటే వారికున్న విజ్ఞత, ప్రతిభ మీద అనుమాన పడాల్సివస్తుంది. ప్రతిభ. విద్వత్త్ అన్నవి మనిషికి చెందినవి..అవి గ్రామాలలోనే నివసితే అంతగా బయట ప్రపంచానికి తెలియకుండా పోతుంది దానికొరకు నగరాలకు వలస వస్తారు అంతే కాని ప్రత్యేకంగా " ఒక్క నగరానికి " వస్తే మాత్రమే పేరు ప్రఖ్యాతలు వస్తాయనుకుంటే అంత కన్న మూర్ఖత్వం ఏది లేదు. అలా అయితే రావిశాస్త్రి, మధురాంతక రాజారాం, కాళీపట్నం రామారావు, చలం ఇంకా చాలా మందే వున్నారు మరి వీరంతా నగరజీవనం చేయకుండానే పేరు ప్రఖ్యాతులు పొందారే.! ఊరికే అనవస్రపు బూతాన్ని చూపకండి. మీరు ఉదహరించిన కవులు హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి వారి వారి వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్ల కుండ తగు జాగ్రత్తాల్లోని మాటలు గానే మాలాంటి వారు గుర్తిస్తారు...మీఉర్ వాటిని గఒప్పగా బయటకు చెప్పుకుంటారు అంతే తేడ.

    ReplyDelete
  4. ఆదర్శప్రాయులైన తెలంగాణ రచయితలు ఆంధ్ర ప్రాంతం వారిపై చూపిస్తున్న ఆప్యాయత
    తెలంగాణ లో వారి లో కూడా ఆదర్శప్రాయులైన పౌరులు ఉంటారు. మన తెలంగాణ రచయితలు/సోదరులు ఆంధ్ర ప్రాంతం వారి పై ఎంతో ప్రేమ తో రాసిన కవితలు చూడండి .

    http://www.scribd.com/doc/46460845/Quit-Telangana-Singidi-Rachayitala-Sangham

    "అన్నదమ్ముల్లా విడిపోదాం! ఆత్మీయుల్లా కలిసుందాం!" అంటే ఇదే కదా మరి.

    ReplyDelete
  5. ఇక్కడ కవిత్వం ఏ ప్రాంతంలో ఎట్ల వస్తున్నది అన్న విషయం ఎత్తి చూపడానికి కాదు ఈ పోష్ట్ పెట్టింది. సీమాంధ్ర ప్రముఖ కవులు తెలంగాణ ఉద్యమంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలియజెప్పేటందుకు. దాన్ని పక్కదారి పట్టిస్తూ, మీ సీమాంధ్ర కవులే మీ ప్రాంత కవిత్వంపై చేసిన వ్యాఖ్యలపై మీరే గింజుకొంటె ఎట్ల?
    అట్ల జెప్పాలంటే అరవై ఏండ్ల నుండి తెలంగాణలో పెద్దగ కవులే లేరని, కవిత్వమంటే ఆంధ్రా సైడే.. అని ఎంత మంది సీమాంధ్రులు పోజు కొట్టలేదు. అప్పుడు మా హృదయాలెంత గాయపడి ఉంటయ్? ఇప్పుడది కాదుగనీ, సమైక్యాంధ్ర ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఉన్న తేడా ఏందో మీ కవులే చెప్పుతున్నరు. అది తెలుసుకోండి. ఎవడైనా నిష్పాక్షికంగ మాట్లాడితె భయపడి మాట్లాడుతున్నడంటరు. భయపడెటోళ్లు ఆ సభలకే రారు. ఒక స్థాయి వచ్చినాక వాళ్ళు మీలాగ స్వార్థంతో, సంకుచుతంగా మాట్లాడలేరు. అది విషయం.

    ReplyDelete
  6. అయ్యా Shayi గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.! చాలా చోట్ళ చెప్పి చెప్పి నా నోరు నస్తున్నది..మీకు చెప్పడం కూడ శుద్దదండగ..అర్థం చేసుకునే మనసు..ఓపిక ఏవి లేవు..మీలాంటి వారి బ్లాగ్స్‌కి వచ్చి చదవడం కూడ అనవసరమనిపిస్తున్నది. అంతే మీరంతా ఒక వృత్తంలో బతుకుతూ అదే జీవితం అనుకుంటారు..అలానే కానివ్వండి. శెలవ్.

    ReplyDelete
  7. కమల్ గారు ..
    సరే.. మీ స్వార్థ ప్రయోజనాల వృత్తంలో మీరు బతకండి.

    ReplyDelete