Wednesday 17 October 2012

భయం భయంగా ..




భయం భయంగా సాగుతున్నట్టుంది హైదరాబాదులో జరుగుతున్న 'అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు'. ప్రారంభ సదస్సుకు ముందు తెలంగాణ మార్చ్ దెబ్బ ఎక్కడ ఆ సదస్సుపై పడుతుందో అని గజ గజ వణికింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని పర్యటన ఎక్కడ రసాభాస అవుతుందో అని మళ్లీ కుత కుతలాడింది పాపం. ప్రధానిని గగన తలం నుండి దింపి, కార్యక్రమం తరువాత గగన మార్గంలోనే పంపించేసింది. సదస్సులో తెలంగాణ మీడియా ప్రవేశాన్ని నిషేధించి ప్రజాస్వామ్యాన్ని మంట గలిపింది. శాంతియుత నిరసనలను కూడా ఎదురుకొనే ధైర్యం లేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చూస్తె జాలి వేస్తోంది.
 అన్యాయంగా అణచివేసేది " భాష ఒక్కటైనా మా జీవన వైవిధ్యాన్ని గుర్తించి ప్రత్యెక రాష్ట్రాన్ని ఇవ్వా"లని కోరే న్యాయబద్ధమైన ఉద్యమాన్ని. జరుపుతున్నది 'జీవ వైవిధ్య సదస్సు'. దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా లేదు?   



Saturday 13 October 2012

చెంప పెట్టు


"జై బోలో తెలంగాణ" చిత్రానికి, ఆ చిత్ర దర్శకుడు శంకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడంతో
తెలంగాణ ఉద్యమంలో న్యాయం లేదని వాదించే వితండవాదుల చెంప ఛెల్లుమనిపించినట్టయింది.


Wednesday 11 April 2012

సీమాంధ్రులైనా ...

సీమాంధ్రులైనా .. ప్రాంతాల కతీతంగా ఎదిగి, నిష్పాక్షికంగా తమ అభిప్రాయాలను తెలిపే మానవతావాదులు, మేధావులు ఎందరో ఉన్నారు. మచ్చుకి ...


Monday 9 April 2012

కె.సి.ఆర్. ఏం జేసిండు?

("నమస్తే తెలంగాణ" న్యూస్ పేపర్ సౌజన్యంతో)

Sunday 12 February 2012

నిష్ఠుర సత్యాలివి!



అవహేళన చేయబడ్డవాడు తన మూలాలను పరిశోధించి, తన అస్థిత్వాన్ని వెదుక్కుంటాడు. ఆ అన్వేషణలో తనను అకారణంగా న్యూన పరుస్తున్నారన్న విషయం తేలినప్పుడు నిరసిస్తాడు. తిరుగుబాటు చేస్తాడు. ఉద్యమిస్తాడు. తెలంగాణ ఉద్యమం అలా పుట్టిందే. ఇప్పుడు తెలంగాణలో ప్రతి విద్యావంతుడు అదే పని చేస్తున్నాడు. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ‘ దిన పత్రికలో అచ్చయిన ఈ వ్యాసం అందుకు సాక్ష్యం. ( ఈ వ్యాస రచయితకు సీమాంధ్ర వ్యవహార భాషపై ఎలాంటి ద్వేషం లేదు. అందుకు తార్కాణం ఈ వ్యాసం ఆ భాషలో రాయబడడమే.)


Sunday 29 January 2012

TV9 సుమతి! ఎక్కడ బబ్బున్నావు?



టాంక్ బండ్ పై తెలంగాణ వాదులు సీమాంధ్రుల విగ్రహాలను ధ్వంసం చేసిన రోజు " ఉద్యమం పేరిట పైత్యం ప్రకోపించింది .. ఆందోలనకారులు చిల్లర మూకల స్థాయి కన్నా దిగజారారు.. సంస్కారం ఛచ్చిపోయింది.. మానవత్వం మంట గలిసింది.. ” అంటూ గొంతు చించుకొన్న TV9 సుమతి! ఇప్పుడు ఎక్కడ బబ్బున్నావు?
ఆ రోజు లైవ్ ప్రోగ్రాంలో ”నాకెవరైనా సమాధానం చెప్తారా? దీనికి బాధ్యత వహించి ఎవరైనా స్పందిస్తారా?” అంటూ గంగవెర్రులెత్తినావు.
ఆనాడు ఉద్యమ నేపధ్యంలో టాంక్ భండ్ మీద తెలంగాన ప్రముఖుల విగ్రహాలు పెట్టలెదన్న కోపంతో తెలంగాణవాదులు సీమాంధ్రుల విగ్రహాలను పడగొడితే ఆందులో ఒక లాజిక్ ఉంది.
కానీ ఇయ్యాల సీమాంధ్రలో ఏ ఉద్యమం లేదు. ఏ లాజిక్ లేదు. మరి అంభేడ్కర్ విగ్రహాలతోబాటు, ఎన్జీ రంగా, ఎన్టీయార్, వైఎస్సార్, వంగవీటి రంగా .. ఇలా సీమాంధుల విగ్రహాలనె వాల్లె పగలగొడితుంటే .. పెద్ద పెద్ద వాక్యాలు లేవేమి? సన్నాయి నొక్కులు తప్ప. సీమాంధ్ర మీడీయా కళ్ళు దొబ్బాయా? గొంతులు పూడుక పోయినయా? ఉద్యమావేశంలో ఛేసింది ఘోరమైన తప్పా? లేనిపోని దుర్భాషలాడ్తారా? చిల్లర రాజకీయాల కోసం ఛెస్తె ’’నేరస్తులను పోలీసులు వెదుకుతున్నారు” అంటూ మర్యాద భాష వాడ్తారా?
సిగ్గులెని యాంకర్లు .. సిగ్గు షరం లేని మీడియా..